సుప్రీం హీరో అని మెగాభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్న సాయి ధరం తేజ్ వరుస విజయాలతో స్పీడ్ చూపించి.. ఇప్పుడు జాగ్రత్త పడుతున్నాడు. తిక్క.. విన్నర్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఫేర్ చేయలేకపోయాయి. ప్రస్తుతం బీవీఎస్ రవి దర్శకత్వంలో జవాన్ అనే మూవీలో నటిస్తున్నాడు తేజు.
రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ చార్మినార్ దగ్గర జరిగింది. అయితే.. ఎక్కువ రద్దీ లేకుండా ఉండేందుకు.. ఎండల నుంచి తప్పించుకునేందుకు తెల్లవారు ఝామునే షూటింగ్ చేసేశారు జవాన్ యూనిట్. మెహ్రీన్ కౌర్ పీర్జాదా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలోని ఓ పాటకు సంబంధించిన సీక్వెన్స్ లో.. చారిత్రాత్మక కట్టడాన్ని చూపించాల్సిన అవసరం ఉంటుందట. అందుకే ఈ సీన్ కోసం చార్మినార్ ను ఎంచుకున్న జవాన్ యూనిట్.. జనాల తాకిడి నుంచి తప్పించుకునేందుకు ఎర్లీ మాణింగ్ షూటింగ్ చేశారు.
జవాన్ అనే టైటిల్ పెట్టినా.. ఇది ఫక్తు కమర్షియల్ మూవీ అని ముందే చెప్పాడు దర్శకుడు బీవీఎస్ రవి. జనాల్లో ఉండే జవాన్ మా హీరో అన్నాడు.