Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-May-2016 12:15:12
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్లలో ఒకడైన దిల్ రాజు.. ఓ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడంటే.. దాని కోసం అప్పటికే అన్నీ సెట్ అయినట్లే. కానీ ఈ మధ్య వరుసగా దిల్ రాజు టేకప్ చేసిన ప్రాజెక్టులు అటకెక్కేస్తున్నాయి. రవితేజతో ఎవడో ఒకడు తర్వాత.. శతమానం భవతి పరిస్థితి కూడా ఇలాగే తయారైందనే టాక్ వచ్చింది. శతమానం భవతి అనే ప్రాజెక్టును సతీష్ వేగేశ్నతో చేసేందుకు దిల్ రాజు ఓకే చేశాడు.

మొదట సాయిధరం తేజ్ తో ఈ సినిమా తీస్తాడనే వార్తలు వచ్చాయి. తర్వాత లీడ్ రోల్ తేజు నుంచి రాజ్ తరుణ్ కి వెళ్లిందన్నారు. ఈ కుర్ర హీరో అగ్రిమెంట్ కూడా చేసుకున్నాడనే వార్తలు వచ్చాక.. తిరిగి ఈ ప్రాజెక్టు డైలమాలో పడింది. రెండు సందర్భాల్లోనూ హీరోలకు దిల్ రాజుకు వచ్చిన తేడాలే కారణంగా చెప్పుకొచ్చారు. కానీ శతమానం భవతి ప్రాజెక్టుపై దిల్ రాజు ఇప్పుడో క్లారిటీ ఇచ్చాడు.

'శతమానం భవతి స్టోరీని సాయి ధరం తేజ్ - రాజ్ తరుణ్..ఇద్దరికీ చెప్పాం. నాకు ఆ హీరోలతో ఎలాంటి గొడవలు లేవు. ప్రాజెక్టుకు ఇంకా ఎవరూ సైన్ చేయలేదు. ఆగస్టులో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళుతున్నాం. అప్పటికి ఎవరు డేట్స్ ఇస్తే ఎవరు ఖాళీగా ఉంటే వారితో చేస్తాను. సాయిధరం తేజ్ - రాజ్ తరుణ్ లలో ఎవరితోనూ నాకు గొడవల్లేవు' అని చెప్పాడు దిల్ రాజు. మొత్తానికి అటకెక్కేసిందని అనుకున్న ఓ ప్రాజెక్టుకు.. జనవరి 14 - 2017 న విడుదల చేయాలని అనుకుంటున్నా అని రిలీజ్ డేట్ కూడా ఇచ్చాడంటే.. దటీజ్ దిల్ రాజు అనాలి కదూ.

,  ,  ,  ,  ,  ,