Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Jun-2017 13:51:59
facebook Twitter Googleplus
Photo

ఈ రోజుల్లో ఒక నిర్మాత 25 సినిమాలు తీయడం అంటే మామూలు విషయం కాదు. ఒకప్పటి పెద్ద బేనర్ల సంగతి పక్కన పెట్టేస్తే.. గత రెండు మూడు దశాబ్దాల్లో మొదలై 25 సినిమాలు తీసిన బేనర్ టాలీవుడ్లో ఏదైనా ఉందంటే.. అది దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మాత్రమే అని చెప్పాలి. తన సంస్థకు ప్రత్యేకమైన 25వ సినిమా కోసం అదిరిపోయే కాంబినేషనే సెట్ చేశాడు రాజు. అల్లు అర్జున్-హరీష్ శంకర్ లాంటి క్రేజీ కాంబినేషన్లో ఈ సినిమాను నిర్మించాడు. ఐతే తమ బేనర్లో 25వ సినిమాను బన్నీతో తీస్తే బాగుంటుందని ఆయనకు ముందు సలహా ఇచ్చింది తన కూతురు హన్షితేనట. ఆమె చెప్పాకే ఈ సినిమాకు బన్నీని కమిట్ చేయించినట్లు రాజు తెలిపాడు.

నిర్మాతగా తనకు.. హీరోగా బన్నీకి ‘ఆర్య’ రెండో సినిమా అని.. ఆ సినిమాతో స్టార్ అయ్యాడని.. తమ బేనర్ కు కూడా స్టార్ ఇమేజ్ వచ్చిందని రాజు తెలిపాడు. అలాగే తమ బేనర్ కు ఆరో సినిమా అయిన పరుగు.. బన్నీకి హీరోగా కూడా ఆరో సినిమా అని.. ఇలా జరగడం యాదృచ్ఛికమని.. ఆ సినిమా బన్నీకి ఒక మంచి పెర్ఫామర్ గా పేరు తెచ్చిందని చెప్పాడు. మళ్లీ బన్నీతో సినిమా చేయడానికి తొమ్మిదేళ్లు పట్టిందని.. ఇందుకు కారణం సరైన కథ దొరక్కపోవడమే అని అన్నాడు. గత నాలుగేళ్ల నుంచి ఎన్నో కథలు అనుకున్నా వర్కవుట్ కాలేదని.. చివరికి తమ బేనర్లో 25వ సినిమా అతడితో కుదిరిందని రాజు చెప్పాడు. 25వ సినిమాకు చాలా మంచి కాంబినేషన్ ఉండాలని చెప్పిన తన కూతురు.. బన్నీతో అయితే బాగుంటుందని సలహా ఇచ్చిందని.. ఆమె అన్నట్లే డీజే సెట్ అయిందని.. ఈ సినిమాతో బన్నీతో పాటు హరీష్ శంకర్తోనూ తనకు మూడో సినిమా

,  ,  ,  ,  ,  ,  ,