Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Nov-2016 11:34:44
facebook Twitter Googleplus
Photo

మణిరత్నం స్థాయి ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన తమిళంలో తీసే సినిమాల్ని కళ్లకద్దుకుని తెలుగులోకి తీసుకుంటారు మన నిర్మాతలు. ఇందుకోసం ఆయన కథ చెప్పాల్సిన పని లేదు. రషెస్ చూపించాల్సిన అవసరమూ లేదు. ప్రివ్యూ కూడా వేయాల్సిన పని లేదు. ఐతే ఇంతకుముందు ఏం జరిగిందో కానీ.. దిల్ రాజు విషయంలో మాత్రం మణిరత్నం చూపించిన ప్రత్యేక శ్రద్ధ.. ఆయనకు ఇచ్చిన గౌరవం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. దిల్ రాజుకు తెలుగులో ఉన్న రెపుటేషన్ తెలుసుకుని.. ఆయన తన గత సినిమా ?ఓకే బంగారం?తో పాటు తాజా సినిమా ?డ్యూయెట్? కథను కూడా షూటింగ్ ఆరంభం కావడానికి ముందే చెప్పాడట. ఈ విషయాన్ని దిల్ రాజు స్వయంగా వెల్లడించాడు.

మణిరత్నం లాంటి లెజెండరీ డైరెక్టర్ తనకు కథ చెప్పడం గౌరవంగా భావిస్తున్నాని.. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా ?డ్యూయెట్? షూటింగ్ ఆరంభం కావడానికి ముందే తనకు స్టోరీ నరేట్ చేశాడని దిల్ రాజు వెల్లడించాడు. ఇంతకుముందు ?ఓకే బంగారం? విషయంలోనూ తనకు మణిరత్నం నరేషన్ ఇచ్చాడని దిల్ రాజు తెలిపాడు. ?ఓకే బంగారం? సినిమాను దిల్ రాజు ప్రమోట్ చేసి.. చక్కగా రిలీజ్ చేసిన తీరు మణిరత్నంకు బాగా నచ్చిందని సమాచారం. అందుకే తన కొత్త సినిమాను కూడా దిల్ రాజుకు తక్కువ రేటుకే ఇచ్చాడట. కార్తి-మణి కాంబినేషన్లో తెరకెక్కిన ?డ్యూయెట్? మీద పాజిటివ్ బజ్ ఉన్న నేపథ్యంలో ఈసారి రిలీజ్ కొంచెం భారీగానే చేయాలనుకుంటున్నాడు దిల్ రాజు.

,  ,  ,  ,  ,