Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Oct-2017 11:42:35
facebook Twitter Googleplus
Photo

మల్టీ స్టారర్ సినిమాల కోసం సౌత్ సినీ ప్రేక్షకులు చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్నారు. దర్శకులు కూడా తియ్యాలని అనుకుంటున్నారు కానీ ఆ విషయం వేడుకలలో స్పీచ్ వరకే పరిమితం అవుతున్నాయి. ఇక రీసెంట్ గా దేశం మొత్తంగా గుర్తింపు తెచ్చుకున్న మణిరత్నం అనుకున్నట్టుగా అన్ని భాషల హీరోలను కలుపుకొని సౌత్ లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ అని చెప్పి ఒక సినిమాను సెట్స్ పైక్ తెచ్చేశారు. కానీ అందులో టాలీవుడ్ హీరోలు మాత్రం లేరు.

విజయ్ సేతుపతి - శింబు మరియు అరవింద్ స్వామి ముగ్గురు తమిళ్ హీరోలను తీసుకున్నారు. ఇక మలయాళం నుంచి ఫాహాద్ ఫజిల్ ని ఎన్నుకున్నారు. ఇక కథానాయికలుగా ఐశ్వర్య రాజేష్ - జ్యోతిక లను ఎంపిక చేసుకున్నారు. అయితే ముందుగా ఈ సినిమాలో టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని ని సెలెక్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ మణిరత్నం ఎందుకో చివరి నిమిషంలో తప్పించారు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. నాని ఇంతకుముందు మణిరత్నం - ఒకే బంగారం సినిమా తెలుగులో డబ్ చేసినప్పుడు దుల్కర్ సల్మాన్ కి డబ్బింగ్ చెప్పాడు.

అయితే ఈ సారి ఆ మల్టీ స్టారర్ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కాబోతోంది. బిగ్గెస్ట్ సౌత్ మల్టీ స్టారర్ అని చెప్పిన మణిరత్నం ఒక్క తెలుగు హీరోని ఎంచుకోకుండా తెలుగులో కూడా డబ్ చేస్తుండడం గమనార్హం.

,  ,  ,  ,