అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం 'దోచేయ్'. 'స్వామి రారా' సినిమాతో హిట్ కొట్టిన సుధీర్ వర్మ దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. దోపిడీ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో కృతి సనాన్ కథానాయికగా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అది పూర్తయిన వెంటనే రీరికార్డింగ్ ప్రారంభిస్తారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వచ్చే నెల 20న దీనిని రిలీజ్ చేయడానికి డేట్ ఖరారు చేసినట్టు చెబుతున్నారు. బీవీయస్ఎన్ ప్రసాద్ దీనిని నిర్మిస్తున్నారు.
nagachaitany, dochey, releasedate,