పవన్ కల్యాణ్, వెంకటేష్ కలసి నటిస్తున్న 'గోపాల గోపాల' చిత్రం శాటిలైట్ హక్కులకు జరిగిన తీవ్రమైన పోటీలో ఆఖరికి జెమిని టీవీ విజయం సాధించి హక్కుల్ని సొంతం చేసుకుంది. అయితే, ఈ అమ్మకం ఒక ప్యాకేజీ పద్ధతిలో జరిగినట్టు చెబుతున్నారు. సురేష్ బాబు చేతిలో వున్న 'గోపాల గోపాల', 'దృశ్యం', 'భీమవరం బుల్లోడు' చిత్రాల మూడింటికి కలిపి 20 కోట్ల ప్యాకేజీని నిర్ణయించినట్టు, జెమిని టీవీ అందుకు ఓకే చెప్పి వీటికి కమిట్ అయినట్టు తాజా సమాచారం. వీటిలో 'భీమవరం బుల్లోడు' ఫ్లాప్ సినిమా. మామూలుగా అయితే, దానికి శాటిలైట్ రేటు అంతగా పలకదు. అందుకే, దానిని ప్యాకేజీలో తోసేసినట్టు చెబుతున్నారు.
pawankalyan, venky, gopalagopala, tollywood, news, satelitegemini,