నిన్నటి వరకు మన హీరోలంతా ఇద్దరు, ముగ్గురు సంగీత దర్శకులనే తమ సినిమాలకు వాడుకుంటూ వచ్చారు. అలా వారికే పరిమితమైపోవడంతో పాటల్లో మొనాటనీ వచ్చేసిన భావన కలుగుతోంది. అందుకే, ఇప్పుడు మన స్టార్ హీరోలు కొత్త వారితో పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, శ్రీను వైట్ల చిత్రానికి అనిరుధ్ ని తీసుకున్నారు. అలాగే, మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ చిత్రానికి మొహమ్మద్ జిబ్రాన్ ని తీసుకున్నట్టు వార్తలొచ్చాయి. ఇప్పుడు నాగార్జున, కార్తీ కలసి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించే చిత్రానికి గోపీ సుందర్ ని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు. మలయాళ సంగీత దర్శకుడైన గోపీ ఇటీవల వచ్చిన 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' చిత్రానికి సంగీతాన్ని ఇచ్చాడు. కాగా, పీవీపీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదు, అన్నపూర్ణా స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. నాగార్జున, కార్తీలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్ కు అమల క్లాప్ ఇచ్చారు.
gopisundar, nagarjuna, karthi, shrutihasan, pvp, vamshi,