Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Apr-2017 10:38:44
facebook Twitter Googleplus
Photo

కోలీవుడ్ హీరో ధనుష్ కు కోర్ట్ నుంచి రిలీఫ్ లభించింది. కొన్ని నెలలుగా ఇబ్బంది పెడుతున్న కేసు నుంచి.. ధనుష్ బయటపడ్డాడు. ధనుష్ తమ కొడుకేనని.. వృద్ధాప్యంలో తమను పట్టించుకోవడం లేదని కదిరేశన్ దంపతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

అయితే.. ఈ కేసులో మొదటి నుంచి అన్నీ ఈ తమిళ హీరోకి వ్యతిరేకంగానే జరిగాయి. పుట్టుమచ్చల నుంచి సర్టిఫికేట్స్ వరకూ అన్ని వ్యవహారాలు ధనుష్ కు అడ్డం తిరిగాయి. కదిరేశన్ దంపతులు చెప్పిన పుట్టుమచ్చలు ధనుష్ ఒంటిపై ఉన్నా.. వాటిని బలవంతంగా లేజర్ ట్రీట్మెంట్ తో తొలగించుకున్నాడని డాక్టర్లు ధృవీకరించారు. దీంతో ఈ కేసులో ధనుష్ ఓడిపోవడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ కోర్టు తీర్పు మాత్రం ఆశ్చర్యకరంగా వచ్చింది. ధనుష్ వారి కొడుకే అని నిర్ధారించేందుకు.. కదిరేశన్ దంపతులు చూపిన సాక్ష్యాలు సరిపోవని కోర్టు అభిప్రాయపడింది.

ధనుష్ కి ఈ కేసులో ఊరట లభించడంతో.. అతని కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ కేసు విషయం బయట పడేవరకూ.. తమిళ దర్శకుడు కస్తూరి రాజా కొడుకుగానే ధనుష్ ప్రపంచానికి తెలుసు

,  ,  ,  ,  ,  ,