అప్పట్లో ఎన్టీఆర్ తో చేసిన సినిమా నాన్నకు ప్రేమతో ప్రారంభానికి ముందు ఆలస్యమవడంతో ఈ గ్యాప్ లో కుమారి 21 ఎఫ్ స్క్రిప్ట్ కంప్లీట్ చేసిన సుకుమార్.. మరోవైపు ఓ స్టార్ హీరోకు కూడా స్టోరీ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు రెడీ చేసుకున్న కథనే ఇప్పుడు రామ్ చరణ్ తో చేయబోతున్నాడట. ఆ చిత్రం బడ్జెట్ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఈ సినిమాని నిర్మించనున్న మైత్రీ మూవీస్ వారికి ఈ చిత్రం బడ్జెట్ 70 కోట్లు అని సుకుమార్ చెప్పాడని సమాచారం. అయితే రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ ఎంత క్రేజ్ వస్తుంది. దానిపై ఎంత లాభం వేసుకుని అమ్మాలి అనే లెక్కలు వేస్తే మొత్తం అన్ని కలిపి వంద కోట్లకు రిలీజ్ కు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగలిగితేనే ఫలితం ఉంటుందని భావించారట నిర్మాతలు. దాంతో నిర్మాతలు కాస్త కంగారుపడటంతో నిర్మాతలను రామ్ చరణ్ దగ్గరుండి ఒప్పించినట్లు సమాచారం. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సురేంద్రరెడ్డితో తెరకెక్కిస్తున్న తని ఒరువరన్ రీమేక్ సినిమా పూర్తవగానే.. రామ్ చరణ్ ఈ సినిమాపై దృష్టి సారించనున్నాడు.
High, Budjet, Sukumar, RamCharan, Movie, Matter,