జగపతిబాబుకి సెకండ్ ఇన్నింగ్ భలే కలిసొచ్చింది. వరుసగా కీ రోల్స్ చేస్తూ.. తన డిమాండ్ని అంతకంతకూ పెంచుకొంటూ పోతున్నాడు. అగ్ర హీరోల సినిమాలకు ప్రతినాయకుడి పాత్ర అంటే జగపతిబాబే గుర్తొస్తున్నాడు. ఇప్పుడు విశాల్కీ.. ఆయనే విలన్గా మారాడు.
విశాల్ కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. తమన్నా కథానాయిక. సురాజ్దర్శకుడు. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా జగపతిబాబు కనిపించబోతున్నాడు. ఇందులో ఆయనకు జోడి కూడా వుంది. సినియర్ హీరోయిన్ నిరోషా ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. అమెనే జగపతికి తోడుగా కనిపించనుంది. ఇందులో జగపతి పాత్ర అదిరిపోయిందట. సరికొత్త జగపతిని చూడబోతున్నారని చిత్ర యూనిట్ చెబుతోంది.
ఈ సినిమా ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ విడుదల కాబోతోంది కాబట్టి.. జగ్గూభాయ్ ఒక సినిమాతో రెండు చోట్లా తన ప్రతాపం చూపించే వీలుందన్నమాట.