జనతా గ్యారేజ్? సందడి మొదలైపోయింది. ఎన్టీఆర్ ? కొరటాల కలయికలో తెరకెక్కిన చిత్రం ?జనతా గ్యారేజ్?. ఆగస్టు 12న ఈ సినిమా ఆడియోను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో రోజుకో సరికొత్త పోస్టర్ ని వదులుతోంది చిత్రబృందం. తాజాగా మోహన్ లాల్ కుర్చిలో కూర్చుని ఎన్టీఆర్ కు ఏదో చెబుతున్న ఫోటో ను విడుదల చేశారు. ఇప్పుడీ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సీరియస్ చర్చలు సాగిస్తోన్న ఈ పిక్ పై నందమూరి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. అన్నట్టు ఈ సినిమా సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలావుండగా.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఎన్ టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ లు జతకట్టనున్నారు. కాజల్ ఐటమ్ సాంగ్ లో మెరవనుంది. మలయాళ నటుడు మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం దేవీ శ్రీ ప్రసాద్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.