Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Sep-2015 10:57:43
facebook Twitter Googleplus
Photo

ఇటీవలే `సినిమా చూపిస్త మావ`తో హిట్టు కొట్టాడు రాజ్ తరుణ్. దీంతో ఆయన కొత్త సినిమాలకి బూస్ట్ తాగినంత బలం చేకూరింది. `సినిమా చూపిస్త మావ` రికార్డు కలెక్షన్లు సొంతం చేసుకొంది కాబట్టి ఆ ఊపులో కొత్త సినిమాని బయటికి తీసుకెస్తే మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు దర్శకనిర్మాతలు. అందుకే `కుమారి 21ఎఫ్` పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రమిది. ఆయనే సొంతంగా కథ స్క్రీన్ ప్లే మాటలు అందించారు. సుక్కు శిష్యుడు సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్తరుణ్ - హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా చాలా రోజుల క్రితమే మొదలైంది. అయితే కారణమేంటో తెలియదు కానీ... మందకొడిగా చిత్రీకరణ జరుపుకొంది. రాజ్ తరుణ్ కి హిట్టు పడటంతో ఇప్పుడు వేగం పెంచేసినట్టు కనిపిస్తున్నారు. వీలైనంత త్వరగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలన్న ఆలోచనలో ఉన్నారు. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలపై కూడా దృష్టిపెట్టారు. త్వరలోనే `కుమారి 21ఎఫ్` ప్రమోషనల్ వీడియోని విడుదల చేయబోతున్నారు. హైదరాబాద్ లో జరగనున్న ఆ వీడియో విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్ హాజరుకాబోతున్నారు.

ఎన్టీఆర్ లాంటి స్టార్ రాజ్ తరుణ్ సినిమాకి సంబంధించిన ఈవెంట్ కి హాజరయితే చాలా బాగుంటుంది. సినిమా ప్రమోషన్ కి ఎంతో మేలు జరుగుతుంది. సుకుమార్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు. ఆ అనుబంధంతోనే ఎన్టీఆర్ ప్రమోషనల్ వీడియో విడుదల కార్యక్రమానికి హాజరు కాబోతున్నాడు. సుక్కు ఎన్టీఆర్ లండన్లో రెండు నెలల పాటు షూటింగ్ చేసి ఇటీవలే ఇండియాకి తిరిగొచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తన కుటుంబంతో గడుపుతున్నారు. ఒక రోజు `కుమారి 21 ఎఫ్` ప్రమోషనల్ వీడియో విడుదల కార్యక్రమానికి హాజరుకాబోతున్నాడు. సుకుమార్ కథ కాబట్టి ఆయన ప్రేమకథల్లో స్పెషలిస్ట్ `కుమారి 21ఎఫ్`పై మంచి అంచనాలే ఉన్నాయి. ఆ సినిమా గనక హిట్టయితే ఇక రాజ్ తరుణ్ ఎక్కడికో వెళ్లిపోతాడు. వరుసగా మూడు హిట్లు వచ్చినట్టవుతాయి. హ్యాట్రిక్ విజయాలందుకొన్నాక ఇక తిరుగేముంటుంది?!

,  ,  ,