50 సినిమాల్లో హీరోయిన్ గా నటించి సౌత్ లో హీరోయిన్ గా చక్రం తిప్పిన భామ కాజల్. మూడు పదుల వయసు దాటినా ఇంకా తన అందంతో అభిమానులను అలరిస్తూనే ఉంది ఈ అమ్మడు. అయితే కాజల్ రీసెంట్ గా టాలీవుడ్ స్టార్స్ పై చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఓ టెలివిజన్ షోలో పాల్గొన్న కాజల్ ఆమెతో నటించిన ప్రభాస్-పవన్-మహేష్ మరియు ఎన్టీఆర్ వంటి స్టార్స్ పై కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. వారి స్వభావాలను గురించి కొన్ని విషయాలను తనదైన స్టైల్ లో చెప్పింది. ఆమె చెప్పింది కొంత హాస్యాస్పదంగానే ఉన్న కొందరు అభిమానులు మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు.
ఆ నలుగురు స్టార్స్ ఇంకా ఏ తరహా అలవాట్లను అలవర్చుకోవాలి అన్న ప్రశ్నలకి ఆమె ఏమని సమాధానం చెప్పిందంటే..
ఎన్టీఆర్: హైపర్ యాక్టివిటీని పెంచుకోవాలి
ప్రభాస్: ఎనర్జీ కావాలి
మహేష్: చాటర్ బాక్స్.. అతను ఒక్కోసారి మాట్లాడడం ఆపేయాలి
పవన్ కళ్యాణ్ః కొన్ని సమయాల్లో మాట్లాడడం నేర్చుకోవాలి
ఈ విధంగా ఒక్కో హీరోపై ఒక్కో విధంగా కాజల్ చేసిన కామెంట్స్ అందరిని షాక్ కి గురి చేస్తున్నాయి. టాలీవుడ్ లో ఎక్కువ అభిమానులు ఉన్న ఈ నలుగురి స్టార్స్ పై ఈ తరహా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కాజల్ చేసిన ఈ కామెంట్స్ రానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నెంబర్ వన్ యారి షోలో చేసింది. రీసెంట్ గా నేనే రాజు నేనే మంత్రి సినిమాలో మెరిసిన కాజల్ ఆ సినిమా ప్రచారంలో భాగంగా నవదీప్ తో కలిసి రానా షోలో మెరిసిందిలే.