ప్రస్తుతం 'దృశ్యం' మలయాళ చిత్రం తమిళ రీమేక్ లో నటిస్తున్న ప్రముఖ నటుడు కమలహాసన్, త్వరలో మరో రీమేక్ లో నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అమీర్ ఖాన్ హీరోగా ఇటీవల హిందీలో వచ్చిన 'పీకే' చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం మనకు విదితమే. ఇప్పుడీ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. జెమిని ప్రొడక్షన్స్ సంస్థ ఈ రీమేక్ హక్కులను భారీ రేటుకి సొంతం చేసుకున్నట్టు చెబుతున్నారు. అలాగే, ఇందులో హీరోగా నటించడానికి కమల హాసన్ ముందుకు వచ్చినట్టు చెన్నయ్ సమాచారం. ఈ ప్రాజక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
kamalhasan, pk, remake, tollywood, kollywood, news,