బాహుబలి సినిమా రిలీజయ్యాక కూడా కనీసం కాసిన్ని రోజులు హాలీడే కోసం ఎక్కడికీ వెళ్ళలేదు టీమ్. కాకపోతే మే నెలలో ఎండల తాపం తట్టుకోలేక.. రాజమౌళి ఫ్యామిలీ మాత్రం ఆస్ర్టేలియా చెక్కేసింది. ఇక ప్రభాస్ కూడా ఎంజాయ్ చేయకుండా ఎందుకుంటాడు? మనోడు కూడా హ్యాపీగా కెన్యా అడవులకు వెళ్లాడు. అక్కడ సఫారిలో పులులను.. చిరుతలను.. సింహాలను చూసి ఎంజాయ్ చేశాడు.
అయితే ప్రభాస్ తమ దేశపు నేషనల్ కన్జర్వేటివ్ నేషనల్ పార్కును విచ్చేశాడని తెలుసుకున్న ఆ ప్రాంతపు గవర్నర్.. బాహుబలికి ఒక లెటర్ రాయకుండా ఉండలేకపోయాడు. ''డియర్ ప్రభాస్.. నువ్వు మాసాయ్ మరా నేషనల్ పార్కుకు రావడం మాకు గర్వకారణం. కొంచెం బిజీగా ఉండటం వలన నేను పర్సనల్ గా నిన్ను కలవలేకపోయాను. ఇక్కడి సహజపు అందాలను చూశావు కాబట్టి.. మీ తదుపరి సినిమాల్లో పాటల కోసం ఇతర సీన్ల కోసం ఇక్కడ షూటింగ్ ఏదైనా చేసి మా ప్రాంతాన్ని పాపులర్ చేస్తావని ఆశిస్తున్నా. బాహుబలి 2 రిలీజ్ కోసం.. ఆ సినిమా ఇంగ్లీష్ డబ్బడ్ వర్షన్ కోసం కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటా'' అంటూ గవర్నర్ శామ్యుల్ టునాయ్ ఒక లేఖ రాశాడు.
ఒకే ఒక్క సినిమా. బాహుబలి. ప్రపంచ స్టార్ ను చేసింది మన ప్రభాస్ ను. ఇప్పుడు కెన్యా లోని నారోక్ కౌంటీ గవర్నర్ రాసిన లేఖ అందుకు సాక్ష్యం.