కొరటాల శివ.. చేసినవి మూడే సినిమాలు. అయినా.. అందులో రెండు 100కోట్ల క్లబ్ లో చేరిపోయాయి. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు కొరటాల. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ?జనతా గ్యారేజ్? కేవలం 7రోజుల్లోనే 100కోట్లని కలెక్ట్ చేసింది. దీంతో.. కొరటాల కోరినంత ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు నిర్మాతలు.
రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసి తెలుగు సినిమా చరిత్రలో ?బాహుబలి? తర్వాత హయ్యెస్ట్ గ్రాసర్ స్థానాన్ని దక్కించుకునే దిశగా ?జనతా గ్యారేజ్? బాక్సాఫీసు రేసులో దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. వరుసగా మూడు సినిమాలతో మంచి ఊపుమీద ఉన్న కొరటాల తన తర్వాతి సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నాడు. ఈ చిత్రం కోసం కొరటాల భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారమ్. జనతా గ్యారేజ్ చిత్రానికి తీసుకున్న రెమ్యూనరేషన్ కంటే రూ.5కోట్లు ఎక్కువగా తీసుకుంటున్నాడంట.
జనతా గ్యారేజ్ కోసం కొరటాల రూ. 15కోట్లకి పైగానే తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఇప్పుడు మహేష్ చిత్రం కోసం దాదాపు రూ.20కోట్లపైకి పైనే కొరటాల తీసుకోనున్నాడన్న మాట.