Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Aug-2015 16:46:46
facebook Twitter Googleplus
Photo

అక్కినేని త్రయం నటించిన 'మనం' బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టాలీవుడ్ ఫ్యామిలీ ల్లో ఎన్నో ప్రశ్నల్ని మిగిల్చింది. తెలుగు సినిమా చరిత్రలో దగ్గుబాటి కుటుంబం ఘట్టమనేని కుటుంబం నందమూరి కుటుంబం అక్కినేని కుటంబంతో సమానంగా పాలుపంచుకున్నవే. 80ఏళ్ల టాలీవుడ్ హిస్టరీ లో ఈ కుటుంబాలకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఇన్ని ఫ్యామిలీలు ఉన్నా అక్కినేని ఫ్యామిలీ గొప్పతనాన్ని చాటే సినిమాగా మనం చరిత్ర కెక్కింది. ఏఎన్నార్ నాగార్జున నాగచైతన్య అఖిల్ .. ఇలా ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలంతా ఒకే ఫ్రేములో కనిపించారు.

ఆ తర్వాత రామానాయుడు అలాంటి ఓ సినిమాలో నటించాలని కలలు గన్నారు. కొడుకు వెంకీ మనవడు రానాలతో కలిసి నటించాలని భావించారు. కానీ ఆ కల నెరవేరనేలేదు. ఇక నందమూరి కుటుంబంలో బాలకృష్ణ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కలిసి నటించే సన్నివేశం ఇప్పట్లో కనిపించలేదు. మరో ఫ్యామిలీ ఘట్టమనేని ఫ్యామిలీకి మాత్రం ఆ ఆస్కారం కనిపిస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ ప్రిన్స్ మహేష్ బుల్లి ప్రిన్స్ గౌతమ్ కృష్ణ ఈ ముగ్గురూ కలిసి నటించే సినిమా ఇంకెంతో దూరంలో లేదని టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు.

గుణశేఖర్ 'ప్రతాపరుద్రుడు' (రుద్రమదేవి సీక్వెల్ గా ప్రచారమవుతోంది) అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రతాపరుద్రుడి గా మహేష్ బుల్లి ప్రతాపరుద్రుడిగా గౌతమ్ కృష్ణ కీలకమైన పాత్రల్లో కృష్ణ విజయనిర్మల వంటివారు నటించే అవకాశం ఉంది. ఈ ఫ్యామిలీ అంతా కలిసి ఎప్పట్నుంచో ఓ చారిత్రక చిత్రంలో నటించాలనుకుంటున్నారు. అది ఈ సినిమానే అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి ఇదే సినిమా కోసం గుణశేఖర్ మెగాస్టార్ ఫ్యామిలీని కూడా అప్రోచ్ అయ్యాడు. చూద్దాం ఏమవుతుందో..

,  ,