మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం కోసం విదేశాల్లో ఓ భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ ని దక్షిణాఫ్రికాలో నిర్వహిస్తారని తాజా సమాచారం. అలాగే, కారైకుడి, తెన్ కాశీలలో కూడా ఓ షెడ్యూల్ షూటింగ్ చేస్తారని అంటున్నారు. కాగా, తాజా షెడ్యూలును ఈ నెల 28 నుంచి హైదరాబాదులో చేస్తారు. అయితే, నెలాఖరుకి మహేష్ తన కుటుంబ సభ్యులతో కలసి న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం నాలుగైదు రోజులు అబుదాభి వెళ్లివస్తాడు. ఈ సినిమా కోసం 'శ్రీమంతుడు' టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. మహేష్ సరసన ఇందులో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.
maheshbabu, shruthihasan, southafrica, tollywood, news,