Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Aug-2015 15:41:21
facebook Twitter Googleplus
Photo

నివిన్ పాళీ హీరోగా నటించిన మలయాళ హిట్ చిత్రం 'ప్రేమం'ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగచైతన్య కథానాయకుడు. కార్తికేయ ఫేం చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో చైతూ సరసన ముగ్గురు కథానాయికల్ని ఎంపిక చేసుకున్నారు. బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ముంబై మోడల్ కం నటి దిశా పటానీ మలయాళీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చైతూతో రొమాన్స్ కి రెడీ అవుతున్నారు.

కథాంశం ప్రకారం ఈ సినిమాకి ముగ్గురు నాయికలు అవసరమే. ఓ కుర్రాడు యుక్తవయసులోకి వచ్చాక కాలక్రమంలో ముగ్గురితో ప్రేమలో పడతాడు. 15ఏళ్ల టెర్మ్ లో ముగ్గురిని ప్రేమిస్తాడన్నమాట. అందులో ఓ స్కూల్ టీచర్ కూడా. దీన్నే ఫన్నీ లవ్ స్టోరీగా తెరకెక్కించి మల్లూ బాబులు హిట్ కొట్టారు. అయితే ఈ సినిమాలో యువనాయికల క్యారెక్టర్లకు దిశాపటానీ అనుపమ పేర్లు వినిపించాయి. ఆ తర్వాత స్కూల్ టీచర్ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ హీరోయిన్ పరిణీతిని ఓకే చేశారు. అనుపమ పరమేశ్వరన్ మాతృకలో నటించింది. కథలో మలయాళ అమ్మాయితో చై ప్రేమలో పడే సన్నివేశాలున్నాయి కాబట్టి అనుపమ క్యారెక్టర్ యథాతథంగానే ఉంటుంది.

వాస్తవానికి నివిన్ పాళీ ప్రేమంలో హీరో తమిళ టీచర్ తో ప్రేమలో పడతాడు. కానీ తెలుగు వెర్షన్ లో మన నేటివిటీకి తగ్గట్టే మార్చేస్తున్నారు. చైతన్య క్యారెక్టర్ లోనూ బోలెడన్ని మార్పులున్నాయని దర్శకుడు చెబుతున్నాడు.

,  ,  ,