కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక స్టాంపులను విడుదల చేశారు. నాగార్జున, తాజ్ మహల్ బొమ్మలు ఉన్న ఐదు రూపాయల ప్రైవేటు పోస్టల్ స్టాంపులను.. ఆయన కుమారులు నాగ చైతన్య, అఖిల్ సోమవారం విడుదల చేశారు. 'నిర్మలా కాన్వెంట్' చిత్రబృందం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో స్టాంపులను లాంచ్ చేయడం జరిగింది. నాగార్జున ప్రత్యేక పాత్రలో నటించి, పాట పాడిన 'నిర్మలా కాన్వెంట్' చిత్రంలోని స్టిల్స్ తోపాటు తాజ్ మహల్ చిత్రం కూడా స్టాంపుపై ఉంది.
నాగార్జున, తాజ్ మహల్.. ఇద్దరూ ప్రేమకు చిహ్నాలే అనే వాక్యం రాసుండటం విశేషం. మొత్తం 10,000 స్టాంపులను రూపొందించినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగ్ తనయులు చైతన్య, అఖిల్ మాట్లాడుతూ.. తండ్రే తమకు ప్రేరణ అన్నారు. కాగా ప్రస్తుతం నాగార్జున కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నమో వేంకటేశాయ' సినిమాలో హాథీ రామ్ బాబాగా నటిస్తున్నారు.