ప్రస్తుతం ''జనతా గ్యారేజ్'' సినిమా షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే నాన్నకు ప్రేమతో ఇచ్చిన కిక్ తో ఈసారి ఇంకాస్త ఎమోషనల్ సినిమాను రూపొందించేస్తున్నాడు. అయితే ఈ సినిమా తరువాత తారక్ ఏం చేస్తాడనేది ఇప్పుడు టాపిక్.
నిజానికి పూరి జగన్ డైరక్షన్ లో మనోడు ఒక సినిమా అన్నారు కాని.. పూరి మాత్రం అక్కడ కళ్యాణ్ రామ్ అండ్ నారా రోహిత్ వంటి హీరోలకు కమిట్మెంట్లు ఇస్తూ.. మరో ప్రక్కన రవితేజకు కూడా కత చెబుతున్నాడు. ఇక దర్శకుడు హను రాఘవపూడి ఇప్పటికే యంగ్ టైగర్ కు ఒక లవ్ స్టోరీ చెప్పాడనే సంగతి తెలిసిందే. అయితే ఎప్పటినుండో వక్కంతం వంశీ కూడా లైన్ లో ఉన్నాడు. ఇన్నాళ్ళూ రైటర్ గా ఉన్న వంశీ.. ఇప్పుడు దర్శకుడుగా మారాలని చూస్తున్నాడు.
సన్నిహిత వర్గాల ద్వారా తెలిసిన న్యూస్ ఏంటంటే.. జూలై ఎండింగ్ నుండి తారక్ తనకు చిరకాల మిత్రుడైన రైటర్ వక్కంతం సినిమాయే చేస్తాడట. ముందు వక్కంతంకు డైరక్టర్ గా ఛాన్సిచ్చాకే మనోడు తదుపరి ఏ సినిమాకైనా సైన్ చేస్తాడని చెబుతున్నారు. ఈ సినిమాను కళ్యాణ్ రామ్ ప్రొడ్యూస్ చేస్తుంటే.. మిల్కీ బ్యూటి తమన్నా హీరోయిన్ గా సెలెక్టయ్యే ఛాన్సుంది. అది సంగతి.