నాల్గు రోజుల క్రితం ఎన్టీఆర్ అభిమాని చేతిలో తిరుపతి కి చెందిన పవన్ కళ్యాణ్ అభిమాని వినోద్ హత్య కు గురికాబడిన సంగతి తెలిసిందే..ఈ నేపథ్యం లో పవన్ కళ్యాణ్ స్వయంగా తిరుపతి కి వెళ్లి వినోద్ తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పాడు. కాగా ఎన్టీఆర్ ఈ ఘటన ఫై ఎందుకు స్పందించలేదు అంటూ సినీ జనాలు నిన్నటినుండి విమర్శలు చేయడం మొదలుపెట్టారు. కానీ ఎన్టీఆర్ తన అభిమానులతో ఈ ఘటన ఫై ఆరా తీయడం మొదలుపెట్టాడట.
ఇటువంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరమని జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడని ఫిలిం నగర్ వర్గాలు చెపుతున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపాడని సమాచారం. ప్రస్తుతం జనతా గ్యారేజ్ చిత్ర బిజీ లో ఉండడం వల్ల ఈ విషయం ఫై మీడియా తో మాట్లాడలేకపోతున్నాడని, ఈ రెండు రోజుల్లో ఈ ఘటన ఫై మీడియా తో మాట్లాడతాడని ఎన్టీఆర్ సన్నిహిత వర్గాలు చెపుతున్నారు.