ఇప్పుడు ఫిలిం నగర్లో ఒక ఇంట్రెస్టింగ్ టాక్ జనాల్లను తెగ ఇబ్బంది పెట్టేస్తోంది అనుకోండి. చాలా రోజుల నుండి ఒకటే ఫార్ములా కథను తీసుకుని.. దానినే అటు వార్చి ఇటు వార్చి సినిమాలు తీయడం తీయించడం అంటే మాత్రం అది కోన వెంకట్ కే చెల్లింది. అయితే ఇప్పుడు ఇద్దరు డిఫరెంట్ రైటర్లను పక్కనెట్టేసి ఒక స్టార్ హీరో ఈయన కథను లైక్ చేయడంతో అందరికీ షాకింగ్ గా ఉంది.
ఆల్రెడీ దర్శకుడు బాబు మన జూనియర్ ఎన్టీఆర్ కు చెప్పిన కథ.. కోన వెంకట రాసిందేనని మనం చెప్పుకున్నాం. ఆ కథ చుట్టూ ఉన్న గొడవల సంగతి పక్కనెట్టేస్తే.. ఇప్పుడు ఇక్కడ మరో పాయింట్ హైలైట్ అయ్యింది. కళ్యాణ్ రామ్ తో ఇజం చేస్తున్నప్పుడు పూరి జగన్ ఒక కొత్త కథను ఎన్టీఆర్ కు వినిపించాడు. అలాగే రచయిత వక్కంతం వంశీ కూడా ఎన్టీఆర్ కు ఒక కథను చెప్పాడు. ఆ రెండు కథల్లో లేని విషయం.. కోన వెంకట్ కథలో ఉన్న ఆ కొత్త విషయం ఏంటనేదే ఇప్పుడు అందరూ ఆలోచించేస్తున్నారు.
సాధారణంగా ఒకటే ఇంట్లో కామెడీ చేయించడం తప్ప కోన కథల్లో కొత్తగా ఏమీ కనిపించదు. అటువంటిది ఏకంగా పూరి జగన్ అండ్ వక్కంతం వంశీ వంటి సంచలన రైటర్లను పక్కనెట్టేసి మరీ కోన వెంకట్ కతను ఓకే చేశాడంటే.. జనాలు కాస్త షాకైపోతున్నారు. ఇంతకీ ఆ కథలో ఏముంది అంటారూ?