సరైన హిట్ లేక సతమతమవుతున్న హీరో విష్ణు రాజ్ తరుణ్ తో కలిసి ?ఈడో రకం ఆడో రకం? తో మంచి విజయం సాధించాడు. ?ఈడో రకం ఆడో రకం? సినిమా మల్టీప్లెక్స్ తో పాటు సింగిల్ స్క్రీన్స్ లో కూడా మంచి కలెక్షన్స్ సాధిస్తున్నట్లు తెలియడంతో నిర్మాతలు రెండు తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని థియేటర్లలో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు.
కథ కొత్తగా లేకపోయినా పాత్రల మధ్య ఉన్న కన్ఫ్యూజన్ డ్రామా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా విజయానికి దోహదపడినట్లు విశ్లేషకులు చెపుతున్నారు. జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్పై అనిల్ సుంకర నిర్మించగా ఈ సినిమాలో సోనారిక భడోరియా, హెబ్బా పటేల్ హీరోయిన్లు గా నటించారు.