అక్కినేని ఫ్యామిలీ నుంచి వస్తున్న తాజా హీరో అఖిల్ నటించే తొలిచిత్రానికి సంబంధించిన విశేషాలను దర్శకుడు వీవీ వినాయక్ వివరించారు. నిన్న ఆయన తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదికి వచ్చారు. ఈ సందర్భంగా వినాయక్ చెబుతూ, అఖిల్ ని కథానాయకుడుగా పరిచయం చేసే బాధ్యతను నాగార్జున తనపై పెట్టారని, ఆయన నమ్మకాన్ని నిలబెడతానని చెప్పారు. "ఈ సినిమా స్క్రిప్టు తయారైంది. వెలిగొండ శ్రీనివాస్ అద్భుతమైన కథ ఇచ్చాడు. కోన వెంకట్ దీనికి డైలాగులు రాస్తున్నారు. అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో ఈ స్క్రిప్టు వుంచి పూజలు నిర్వహించాం. ఇంకా కథానాయిక ఎంపిక పూర్తి కాలేదు. అఖిల్ నుంచి అభిమానులు ఆశించే మాస్ మసాలా ఎలిమెంట్స్ అన్నీ ఇందులో వుంటాయి. త్వరలోనే షూటింగ్ మొదలెడతాం" అని చెప్పారు వినాయక్. ఈ చిత్రాన్ని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నట్టు ఆయన తెలిపారు.
akhilakkineni, vvvinayak, thaman, nagarjuna, nathin, sudhakarreddy, dec17th,