ప్రభాస్ నేషనల్ లెవెల్ ఐకాన్ అయిపోయాడని అనడంలో డౌట్ అవసర్లేదు. రీసెంట్ గా ప్రభాస్ రెమ్యూనరేషన్ పై టాలీవుడ్ లో ఓ టైపు రూమర్స్ వస్తే.. నేషనల్ మీడియా ప్రభాస్ కి సపోర్ట్ చేయడం విశేషం.
ఇప్పటివరకూ ప్రభాస్ కు సంబంధించిన సోషల్ మీడియా.. ఇతర పీఆర్ కార్యక్రమాలు అన్నీ కుటుంబసభ్యులు.. స్నేహితులే చేసేవారు. కానీ ఇప్పుడు లెవెల్ అప్ గ్రేడ్ చేయక తప్పడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ ప్రతీ యాక్టివిటీని ముంబై మీడియా గమనిస్తోంది. అందుకే తనకు సంబంధించిన పబ్లిక్ రిలేషన్స్ కార్యక్రమాలను ముంబైలో ఓ ప్రముఖ పీఆర్ ఏజన్సీకి అప్పగించాలని భావిస్తున్నాడట ప్రభాస్. ముఖ్యంగా ప్రభాస్ చేస్తున్న మరుసటి చిత్రానికి.. నేషనల్ లెవెల్ లో డిమాండ్ ఉంటుంది. అందుకు తగ్గ ప్రచార కార్యక్రమాలు కూడా చెయ్యాలి.
ఇందుకు లేటెస్ట్ వ్యూహాలను అమలు చేయాల్సి ఉంటుంది. అందుకే ఇకపై యంగ్ రెబల్ స్టార్ కు సంబంధించిన పనులన్నీ ఓ ముంబై ఏజన్సీ నిర్వహించనుందట. ఇంకా ఎవరికీ బాధ్యతలు అప్పచెప్పకపోయినా.. ప్రస్తుతం డిస్కషన్స్ గట్టిగానే జరుగుతున్నాయి.