దర్శకుడు పూరి జగన్నాద్ కు బ్యాడ్ టైం నడుస్తోంది. గత కొన్నాళ్లుగా ఆయన మ్యాజిక్ వర్క్ అవుట్ కావడం లేదు. టెంపర్ ఓకే అనిపించినా కధ ఆయనది కాదు. జ్యోతి లక్షి, లోఫర్ సినిమాల గురించి చెప్పక్కర్లుదు. డిజాస్టార్లుగా మిగిలిపోయాయి.
ఇప్పుడు ఆయన చేతిలో బడా సినిమా లేవి లేవు. అయితే ప్రకటనలు మాత్రం వున్నాయి. ఇటివలే మహేష్ బాబుతో ?జనగణమన? తీస్తానని ప్రకటించాడు పూరి. దీనిపై ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశాడు. అయితే ఇది ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చెప్పలేదు.
ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమా మాత్రం ఇప్పట్లో సెట్ అయ్యేలా కనిపించడం లేదు. ప్రస్తుతం మురగదాస్ తో సినిమా చేస్తున్న మహేష్.. తర్వాత కొరటాల శివతో జోడి కడతాడు. ఈ సినిమా ఖరారైయింది. చిత్రానికి డి.వి.వి.దానయ్య నిర్మాత.
ఈ రెండు సినిమాలూ పూర్తయ్యేసరికి 2017 చివరి మాటే. ఆ తర్వాత కూడా మహేష్ లైన్ లో త్రివిక్రమ్ వున్నారు. ఈ రకంగా చూస్తే పూరికి వెయిటింగ్ తప్పదు.