తెలుగు పరిశ్రమలో ఉన్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్లో రకుల్ ప్రీత్సింగ్ ఒకరు. స్టార్ హీరోల సరసన దూసుకెళుతున్న రకుల్కి ప్రత్యేకంగా ఓ స్టార్ హీరో సరసన నటించాలనే ఆకాంక్ష ఉంది. ఆ స్టార్ ఎవరో కాదు.. హ్యాండ్సమ్ హీరో మహేశ్బాబు. వాస్తవానికి ?బ్రహ్మోత్సవం? సినిమాలో కాజల్ అగర్వాల్ చేసిన క్యారెక్టర్కి ముందు ఈ బ్యూటీనే అనుకున్నారు. ఐతే.. బ్యాడ్ లక్. డేట్స్ కుదరక ఆ అవకాశాన్ని వదులుకున్నారు రకుల్. ?భవిష్యత్తులో మహేశ్ సరసన నటించే అవకాశం వస్తుందనే నమ్మకం ఉంది? అని ఆ సమయంలో రకుల్ పేర్కొన్నారు. ఆ సమయం ఇప్పుడు వచ్చేసిందని సమాచారం. మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్బాబు హీరోగా ఓ భారీ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఇందులో పరిణీతీ చోప్రాను కథానాయికగా తీసుకున్నారనే వార్త వినిపించింది. ఇప్పుడు రకుల్ ప్రీత్ పేరు వినిపిస్తోంది. మహేశ్తో సినిమా చేయడానికి రకుల్ ఆసక్తిగా ఉన్నారు కాబట్టి, ఈ అవకాశాన్ని వదులుకోకూడదనుకుంటున్నారట.
మరి.. ఈసారైనా ఈ జోడీ కుదురుతుందో? లేదో చూడాలి. ఆ సంగతలా ఉంచితే.. ఆల్రెడీ పరిణీతి పేరు వినిపించింది కాబట్టి ఇందులో ఇద్దరు కథానాయికలు ఉంటారేమోననే ఊహాగానాలు నెలకొన్నాయి. ఓ నాయికగా రకుల్, మరో నాయికగా పరిణీతి నటిస్తారేమో? ఈ నెలలోనే ఈ చిత్రం ఆరంభం కానుంది. సో.. మహేశ్ సరసన ఎవరు చాన్స్ కొట్టేస్తారనేది త్వరలోనే తెలిసిపోతుంది.