ఏదైనా ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే .. దానిని సాధించేవరకూ ఎలాంటి పరిస్థితుల్లోను వెనుకడుగు వేయనని రకుల్ ప్రీత్ సింగ్ చెబుతోంది. తాజాగా తాను నటిస్తోన్న హిందీ సినిమా 'సిమ్లా మిర్చి' గురించి మాట్లాడుతూ ఆమె పై విధంగా స్పందించింది. బాలీవుడ్ దర్శకుడు రమేష్ సిప్పీ రూపొందిస్తోన్న 'సిమ్లా మిర్చి' ద్వారా ఆమె మరోమారు హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.
తెలుగు .. తమిళ భాషల్లో అగ్రస్థానానికి చేరుకున్న త్రిష .. తమన్నా వంటి కథానాయికలు బాలీవుడ్లో రాణించలేకపోవడంతో, వాళ్లతో తనని పోల్చడం బాధగా వుందని అంటోంది రకుల్. తాను అలా అపజయాలకు బెదిరి వెనుకడుగువేసే రకం కాదని చెబుతోంది. తాను ఏ విషయంపై దృష్టి పెట్టినా అందులో సక్సెస్ అయ్యేంతవరకూ వదిలి పెట్టననీ, అలాంటి పట్టుదల కారణంనే ఇంతవరకూ రాగలిగానని అంటోంది. రకుల్ పట్టుదల .. కార్యదీక్ష సంగతి అటుంచితే, ఆమె చేసిన కామెంట్ ఊరికే పోతుందా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.