వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు ఇండస్ర్టీలో పీక్స్ కు చేరిన రకుల్ ఆ తరవాత రామ్ చరణ్ బ్రూస్ లీ -ధృవ - ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమా లతో తన స్థానం పధిలపరుచుకుంది. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో బ్రహ్మరాంబ పాత్రతో అందరిని మురిపించిన రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు టాప్ హిరోయిన్లు లిస్ట్ లో చేరిపోయింది. ఇక బాలీవుడ్ లో యారియన్ తో ఎంట్రీ ఇచ్చినా తెలుగులోనే మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త హింది సినిమా ఆఫర్ వచ్చింది.
అయితే వీటన్నింటికంటే ముందు అమ్మడికి బాలీవుడ్ లో ఒక మాంచి ఆఫరే వచ్చింది. ఎంఎస్ ధోని సినిమా లో ధోని గర్ల్ ఫ్రెండ్ గా నటించే అవకాశం రకుల్ చేయవలిసింది అంటా. అది అప్పుడు మిస్ అయింది. ఆ పాత్రను చివరకు దిశా పటానీకి ఇచ్చారు. కానీ అప్పటికే కొన్ని తెలుగు సినిమాలు ఒప్పుకోవడంతో ఆ సినిమా నుండి తప్పుకోవాలిసివచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ అదే డైరక్టర్ డైరక్షన్ల గొప్ప అవకాశం వచ్చినందుకు చాల సంతోషంగా ఉంది రకుల్. నీరజ్ పాండే డైరక్షన్లో రాబోతున్న సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఎంపికైంది. ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా కు జంటగా నటిస్తుంది.
ఇప్పుడు తెలుగులో సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పైడర్ సినిమాలో కనబడనుంది రకుల్. ఈ సినిమా అతి త్వరలో థియేటర్లో విడుదలకావడానికి సిద్దవుతుంది.