Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Aug-2017 14:20:06
facebook Twitter Googleplus
Photo

ఉపాసనా తనదైన స్టైల్ లో బిజినెస్ లో దూసుకుపోతుంది. అలా వెళుతూ అప్పుడు అప్పుడు సేవా కార్యక్రమాలు చేస్తూ మెగా అభిమానులుకు మరింత చేరువ అయ్యింది. ఇప్పుడు వరద బాధితుల కోసం కొంత మొత్తాన్ని విరాళంగా ప్రకటించింది.

రామ్ చరణ్ – ఉపాసనా కలిపి అస్సాం రాష్ట్రం లో వచ్చిన వరదలుకు 2.68 కోట్లు విరాళంగా ఇచ్చారు. అస్సాం వరద భాదితులు కోసం రామ్ చరణ్ 1.56 కోటి.. ఉపాసన 1.12 కోటి అందజేశారు. దీని కోసం రామ్ చరణ్ తన ఫేస్ బుక్ లో మెసేజ్ కూడా ఇచ్చాడు. ఎవరైనా తన వంతు సహాయం చేయదలుచుకున్నవారు ఆ గవర్నమెంట్ నిర్వహిస్తున్న గ్రూప్ నీ సంప్రదించవచ్చు అని సూచన కూడా ఇచ్చాడు. దేశం లో ఎక్కడ ఏ దుర్ఘటన జరిగిన లేదా ఇలా ప్రకృతి విలయ తాండవం చేసి జనాలు జీవితాలును అల్లకల్లోలం సృష్టించిన తనవంతు సహాయం అందించడంలో ఎప్పుడు ముందు ఉంటాడు రామ్ చరణ్. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూడా 25 లక్షలు విరాళం అందించాడు అస్సాం గవర్నమెంట్కు. ఈ వరదలు కోసం అక్కడ గవర్నమెంట్ కు కేంద్రం కూడా సరైన సహాయం చేసింది. ప్రధాన మంత్రి సహాయ నిది నుండి అక్కడ వరదలో ప్రాణాలు పోగొట్టుకొన్న వారికి 2 లక్షలు తీవ్ర గాయాలు బారినపడిన వారికి 50000 చొప్పున అందించింది.

రామ్ చరణ్ ఇప్పుడు తన తదుపరి చిత్రం రంగస్థలం 1985 సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమాను సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. రంగస్థలం లో హీరోయిన్ గా సమంత నటిస్తుంది. పల్లెటూరు ప్రేమ కథగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదలకాబోతుంది.

,  ,  ,  ,  ,  ,