ప్రస్తుతం జరుగుతున్న ప్రోకబడ్డీ లీగ్ పోటీలను చూడడానికి వచ్చిన టాలీవుడ్ ఆజానుబాహుడు రానా. మీడియా తో మాట్లాడారు. ఈ సందర్భం గా ఆయన తన డ్రీమ్ రోల్ గురించి ప్రస్తావించాడు.విజయనగరం కు చెందిన ప్రసిద్ధి కుస్తీ వీరుడు కోడి రామమూర్తి నాయుడు పాత్రను పోషించాలని ఉందని తెలిపారు. ఆయన కలియుగ భీమునిగా పేరుగాంచాడని రానా తెలిపారు. చిన్నప్పటి నుంచి ఆయన గురించి తెలుసుకుంటూ పెరిగానని రానా అన్నారు. తెరమీద ఆయన పాత్రను పోషించాలని చాలా ఆసక్తి గా ఉందని తెలిపారు.
బాలీవుడ్ స్టార్ హీరో లు అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు ఇప్పటికే కుస్తీ వీరులుగా పాత్రలు పోషించి మెప్పించారు. వారికి ధీటుగా టాలీవుడ్ కు రానా రూపం లో ఓ నటుడు దొరికాడని చెప్పొచ్చు.