టాలీవుడ్ హీరోయిన్ గా వెలుగుతూనే తన సొంతరాష్ట్రం అయిన చెన్నైలోనూ ప్రయాణించింది రెజీనా కసాండ్రా. ఈ మధ్య ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్స్ తగ్గిన మాట వాస్తవమే. అయితే.. ఇప్పటివరకూ స్టార్ హీరోల సరసన చేయకపోవడం.. అమ్మడి కెరీర్ కి అతి పెద్ద లోటు. ఆ గ్యాప్ ని ఫిల్ చేసేందుకా అన్నట్లుగా.. ఇప్పుడు కొత్త స్ట్రాటజీతో ముందుకొస్తోంది రెజీనా.
టాలీవుడ్ హీరోల్లో వాళ్లిద్దరూ సెక్సియెస్ట్ అంటూ కామెంట్ చేసింది రెజీనా. ఈ భామ చెప్పిన వాళ్లిద్దరూ ఎవరంటే.. రామ్ చరణ్ తేజ్.. మహేష్ బాబు. అసలు విషయం ఏంటంటే.. ఈ ఇద్దరు హీరోల పక్కన ఛాన్స్ కోసం ఏ హీరోయిన్ అయినా ఎదురుచూస్తూ ఉంటుంది. మహేష్ అయినా.. చరణ్ అయినా.. వాళ్ల పక్కన ఒకసారి ఛాన్స్ వస్తే చాలు.. ఇక టాప్ లీగ్ లోకి ఎంటర్ అయ్యేందుకు లైసెన్స్ లభించినట్లే. రెజీనాకి సమకాలికులు అయిన హీరోయిన్స్ కి ఇలాంటి ఆఫర్స్ వస్తున్నా.. ఈ బ్యూటీ మాత్రం ఇంకా వెనకబడిపోయి ఉంది. ఆ ఇద్దరు టాప్ హీరోలతో ఛాన్స్ కోసమే.. ఇలా మహేష్- చరణ్ లు ఇద్దరూ సెక్సీ అనే కామెంట్ చేసినట్లుగా బావిస్తున్నారు సినీ జనాలు.
ప్రస్తుతం ఈమె ప్రాధాన్యతా లిస్ట్ లో మొదటగా ఉన్న హీరోలు వాళ్లిద్దరే కావడంతోనే ఆ పేర్లు చెప్పిందన్నది టాక్. అయితే.. ఆన్ స్క్రీన్ తో పాటు.. ఆఫ్ స్క్రీన్ లోనూ మంచి ఫ్రెండ్ షిప్ ఉన్న సాయిధరంతేజ్ పేరు కానీ.. సందీప్ కిషన్ పేరు కానీ ఎందుకు చెప్పలేదబ్బా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి వీటికి రెజీనా ఆన్సర్ ఇస్తుందంటారా!