బాలకృష్ణ ఇప్పటికే తన 102వ సినిమాను ఇప్పటికే స్టార్ట్ చేసేశారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై చాలానే అంచనాలు ఉండగా.. ఇప్పుడీ మూవీకి చాలానే హంగులు తోడవుతున్నాయి.
బాలయ్య-కేఎస్ రవికుమార్ ల కాంబోపైనే మొదటగా అందరి కళ్లూ ఉండగా.. ఇప్పుడీ చిత్రం కోసం సెలెక్ట్ చేస్తున్న హీరోయిన్స్ కూడా ఇంట్రెస్ట్ కలిగిస్తున్నారు. బాలయ్యతో బ్లాక్ బస్టర్ జోడీ అయిన నయనతార లీడ్ హీరోయిన్ రోల్ పోషిస్తుండగా.. ఇప్పటికే మరో హీరోయిన్ ను కూడా ఎంపిక చేశారు. మలయాళీ హీరోయిన్ నటాషా దోషీ మరో హీరోయిన్ పాత్ర పోషిస్తుండగా.. ఈ చిత్రంలో మరో కీలక పాత్ర ఉంటుందట. దీన్ని కూడా క్రేజ్ ఉన్న హీరోయిన్ తో చేయించాలని చూస్తుండగా.. ఇప్పుడీ రోల్ కోసం టాలీవుడ్ యంగ్ బ్యూటీ రెజీనా కసాండ్రాను ఎంపిక చేశారని అంటున్నారు.
మొదట ఈ పాత్ర కోసం ప్రగ్యా జైస్వాల్ ను కూడా పరిశీలించారనే టాక్ వినిపించింది. అయితే.. రెజీనాకు దాదాపుగా బెర్త్ ఖాయం అయిందనే మాట ఇప్పుడు వినిపిస్తోంది