దర్శకుడు మారుతి, ప్రముఖ నిర్మాత దిల్రాజు, శ్రేయాస్ శ్రీనివాస్.. ఈ ముగ్గురు కలిసి నిర్మించిన కామెడీ సినిమా ?రోజులు మారాయి?, జూలై 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. చేతన్, పార్వతీశం, తేజస్వి, కృతిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా యూత్ఫుల్ కామెడీగా టార్గెట్ ఆడియన్స్ నుంచి మంచి స్పందనే తెచ్చుకుంది. ఇక గతవారం కూడా పెద్ద సినిమాలేవీ విడుదల కాకపోవడంతో ఇప్పటికీ ఈ సినిమా మంచి కలెక్షన్స్తో వెళుతోంది. ఇప్పటివరకూ ఈ సినిమా 5 కోట్ల 84 లక్షల రూపాయల గ్రాస్ వసూలు చేసిందని మారుతి స్పష్టం చేశారు.
ఈ ఉదయం హైద్రాబాద్లో ?రోజులు మారాయి? టీమ్ సక్సెస్ మీట్ జరిపింది. ఈ మీట్లో పాల్గొన్న మారుతి, సినిమా మంచి కలెక్షన్స్తో వెళుతోందని, వచ్చేవారం 8 నిమిషాల మేర కొత్త సన్నివేశాలను జత చేస్తున్నామని, దీంతో సినిమా మరింత బాగా మెప్పిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. కొత్త దర్శకుడు మురళి తెరకెక్కించిన ఈ సినిమా ఈతరం యువత ప్రేమల గురించి ప్రస్తావించింది.