నిన్న మొన్నటి వరకు వెండితెరపై వెలిగిన తారలు ఇప్పుడు బుల్లితెరపై కూడా సందడి చేస్తున్న వైనాన్ని మనం చూస్తూనే వున్నాం. ఈ ట్రెండు బాలీవుడ్ లో మరీ ఎక్కువగా వుంది. పారితోషికం పరంగా కూడా బాగా వర్కౌట్ అవుతుండడంతో బాలీవుడ్ తారలు అందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ కోవలో పొడుగుకాళ్ల సుందరి శిల్పా శెట్టి కూడా ఎప్పుడో చేరింది. టీవీ రియాలటీ షోల ద్వారా ఎంతగానో అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు రేడియో జాకీ అవతారం కూడా ఎత్తుతోంది. 'బీబీసీ రేడియో 2' ద్వారా లండన్ శ్రోతలకు బాలీవుడ్ ప్రముఖులను పరిచయం చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ విషయాన్ని తాజాగా తనే ట్వీట్ చేసింది. ఇందుకోసం లతామంగేష్కర్, కరణ్ జొహార్ వంటి ప్రముఖులను ఇప్పటికే ఇంటర్వ్యూలు చేసిందట. ప్రస్తుతం ఆయా కార్యక్రమాల రికార్డింగులతో లండన్ లో బిజీగా వున్నానని అమ్మడు చెబుతూ, ఫొటోలు కూడా పోస్ట్ చేసింది. అన్నట్టు, సెప్టెంబర్ నుంచి ఆమె వాయిస్ ను లండన్ శ్రోతలు వింటారు.
shiplashetty, rj, london, bbc2, news, bollywood,