బక్క భామ శ్రియ కెరీర్.. ఇప్పుడు చివరి దశకు వచ్చేసిందని చెప్పాలి. మనం గోపాలా గోపాల హిందీ దృశ్యం తర్వాత.. ఈమెకు మరో సినిమా ఆఫర్ రాలేదు. నాగ్ కార్తిలో ఊపిరిలో నటిస్తున్నా.. అది కేమియో మాత్రమే. ఇకపై కూడా హీరోయిన్ ఆఫర్స్ వచ్చే అవకాశం లేదన్న మాట అర్ధమైపోతోంది. ఈ విషయంపై శ్రియకు కూడా ఇప్పుడిప్పుడే స్పష్టత వచ్చినట్లుగా ఉంది. అందుకే తను చేసే పాత్రల తీరును మార్చేయాలని అనుకుంటోందట.
బాహుబలిలో రమ్యకృష్ణ చేసిన పాత్రకు ఏ రేంజ్ లో అప్లాజ్ వచ్చిందో చూస్తూనే ఉన్నాం. అలాంటి స్పెషల్ కేరక్టర్లు చేసి మెప్పించాలని భావిస్తోందట శ్రియ. మంచి పాత్ర వస్తే.. ఏజ్ తో సంబంధం లేకుండా చేసేసేందుకు రెడీ అయిపోతోందని తెలుస్తోంది. హీరోయిన్ గా కెరీర్ ముగిసిపోవడంతో.. ఇక స్టైల్ మార్చకపోతే ఇండస్ట్రీలో ఉండడం కష్టమనే విషయం అమ్మడికి బాగానే తెలిసొచ్చింది. అందుకే ఈ మధ్య చీరకట్టు సింగారంతో తెగ ఫోటో సెషన్స్ కూడా చేయించుకుంటోంది.
అమ్మడి వాలకం చూస్తుంటే.. బాహుబలి2 లోనే ఓ కేరక్టర్ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. ఆ సినిమాలో ఒక్కసారి కనిపించినా వచ్చే పేరు ప్రఖ్యాతులు చాలానే ఉంటాయి. అందుకే ఆ గెటప్స్ లో తను ఎలా ఉంటుందో చూపించేందుకు ప్రయత్నిస్తోందని టాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. మరి జక్కన్న ఏమన్నా కరుణ చూపిస్తాడేమో చూడాలి.