త్రిభాషా చిత్రాల కథానాయిక శ్రుతి హాసన్ బాలీవుడ్ లో తాజాగా మరో సంతకం చేసింది. 'తను వెడ్స్ మను', 'రాంజ్ నా' వంటి చిత్రాలను రూపొందించిన ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ తొలిసారిగా నిర్మిస్తున్న చిత్రంలో శ్రుతి కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని తమిళంలో హిట్టయిన 'కల్యాణ సమయల్ సాధం' సినిమా ఆధారంగా నిర్మిస్తారు. ఇది మంచి కామెడీ సినిమాగా తమిళంలో పేరు తెచ్చుకుంది. ఇమ్రాన్ ఖాన్ కథానాయకుడుగా నటించే ఈ హిందీ చిత్రానికి తమిళ వెర్షన్ దర్శకుడు ఆర్.ఎస్.ప్రసన్న దర్శకత్వం వహిస్తాడు. ఈ ఏడాది చివర్లో ఇది సెట్స్ కి వెళుతుంది.
shrutihasan, tollywood, imrankhan, anandlrai,