Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Jun-2017 12:20:36
facebook Twitter Googleplus
Photo

సీనియర్ హీరోయిన్ శ్రీదేవి ఇంగ్లిష్-వింగ్లీష్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని మామ్ చిత్రంతో మొత్తం హింది తెలుగు తమిళ్ మలయాళం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమానికి కుమార్తెలు జాహ్నవి కపూర్ - ఖుషి కపూర్ - భర్త బోని కపూర్ తో కలిసి వచ్చింది. అక్కడ మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలతో శ్రీదేవికి ఒళ్ళు మండిందనే చెప్పాలి.

సినిమా షూటింగ్ కారణంగా శ్రీదేవి మూడు నెలల పాటు తన భర్త బోనీ కపూర్ తో మాట్లాడలేదని అంటోంది. నేను ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డానో ఆయనకు బాగా తెలుసు అందుకే నేను ఆ మూడు నెలలు సరిగా మాట్లాడకపోయినా నన్ను అర్ధం చేసుకొని నాకు పూర్తిగా సహాకిరించారు'' అని చెబుతూ నేను కేవలం ఆయనకు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజ్లు మాత్రమే పెట్టేదాన్ని అని చెప్పింది. ఇలా మాట్లాడుతున్న శ్రీదేవిని మధ్యలో కట్ చేసి.. మీ కూతురు జాన్వి కపూర్ డెబ్యూ సినిమా ఓకె అయిందట కదా.. దాని గురించి చెబుతారా అని అడిగారు మీడియా వారు. దెబ్బతో శ్రీదేవికి చికాకు పుట్టి.. కోపాన్ని దిగమింగి “జాన్వి సినిమా వివరాలు నేను మీకు త్వరలోనే చెబుతాను. జాన్వి వాళ్ళమ్మ సినిమా గురించి మాట్లాడుకుందాం ప్రస్తుతానికి. ఇది నేను నటించిన సినిమా ఈవెంట్. దయచేసి ఈ సినిమా గురించే మాటలాడుకుందాం. అంతవరుకు ఆ పిల్లను ఫోటోలు కూడా తీయకండి. సినిమా గురించి ఏమి అడగకండి అంటూ కామెంట్ చేసింది.

పాపం తన గురించి వస్తే కూతురు గురించి అడిగేసారికి కొంచం అసూయపడిందో లేక అమ్మగా భయపడిందో తెలియదు కాని.. శ్రీదేవి మాత్రం బాగానే ఇరిటిఏట్ అవుతోంది. ఇదంతా గమనిస్తున్న నెటిజన్లు మాత్రం.. ఒకవేళ మీడియా అలాంటి ప్రశ్నలు అడగకూడదంటే.. అసలు కూతుళ్ళను ప్రెస్ మీటకు తెచ్చి స్టేజ్ ఎక్కించడం ఎందుకు.. చక్కగా ఇంట్లోనే కూర్చోపెట్టొచ్చు కదా అంటున్నారు.

,  ,  ,  ,