క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలయికలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ?ధృవ?తో బిజీగా ఉన్నాడు చెర్రీ. ఈ చిత్రం చెర్రీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టనుంది. దీపావఌకి రానున్న ?ధృవ? డిసెంబర్ కి వాయిదా పడిన విషయం తెలిసిందే.
అయితే, ఈ చిత్రం తర్వాత చెర్రీ సుకుమార్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. తాజాగా, ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన విషయాలని బయటపెట్టాడు దర్శకుడు సుకుమార్. రాంచరణ్ ని సరికొత్తగా చూపించబోతున్నామని.. గ్రామీణ నేపథ్యంలో సాగే కథని చెర్రీ కోసం రెడీ చేసినట్టు చెప్పుకొచ్చాడు.
వన్ లో మహేష్ ని, నాన్నకు ప్రేమతో లో ఎన్టీఆర్ ని కొత్తగా చూపించాడు సుక్కు. ఇప్పుడు చెర్రీని కూడా సుక్కు సరికొత్తగా చూపించేందుకు సుక్కు రెడీ అవుతున్నాడు