ప్రస్తుతం తని ఒరువన్ రీమేక్ లో నటిస్తున్నాడు రామ్ చరణ్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఆసినిమా గురించి జనాలు పెద్దగా ఏమీ మాట్లాడుకోవడం లేదు. హిట్టయిన సినిమాకి రీమేక్ కాబట్టి బాగానే వుండొచ్చని అంచనాలు వేస్తున్నాయి.
అయితే ఆ సినిమా తర్వాత చరణ్ చేయబోయే ప్రాజెక్టు గురించి మాత్రం ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. తని ఒరువన్ రీమేక్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో నటించాలని రామ్ చరణ్ డిసైడైన విషయం తెలిసిందే. సుకుమార్ తో కలిసి సినిమా చేయాలని రామ్ చరణ్ ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నాడు. ఇటీవల నాన్నకు ప్రేమతో సినిమాతో ఆయన మళ్లీ ఫామ్ అందుకొన్నాడు కాబట్టి ఈ కాంబినేషన్ అలవోకగా సెట్టయ్యింది.
ఓ సైన్స్ ఫిక్షన్ కథతో ఆ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ సినిమా రామ్ చరణ్ కెరీర్ లో కెళ్లా భారీ బడ్జెట్టుతో తెరకెక్కబోతోందని సమాచారం. రామ్ చరణ్ వంద కోట్ల సినిమా మగధీరకి కూడా అప్పట్లో 40 కోట్లకి మించి బడ్జెట్టు అవ్వలేదు. చెప్పాలంటే రామ్ చరణ్ ఎప్పుడూ భారీ బడ్జెట్టు సినిమాలు చేయలేదు. దాదాపుగా అన్ని సినిమాలు 40కోట్లలోపే తెరకెక్కాయి. అయితే ఇప్పుడు ఏకంగా 70కోట్ల వ్యయంతో చరణ్ సినిమాని తెరకెక్కించేందుకు సుక్కు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఆ కథకి అంతగా ఖర్చవుతుందట. యూనివర్సల్ ఎలిమెంట్ తో వస్తున్న ఆ చిత్రంకోసం ప్రస్తుతం పెద్దయెత్తున కసరత్తులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తెలుగుతోపాటు హిందీలోనూ ఆ సినిమాని తెరకెక్కించే ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం.