హీరోయిన్గా వరుస సక్సెస్లు సాధిస్తున్న మిల్కీ బ్యూటి తమన్నా మరోసారి ఐటమ్ సాంగ్లో కనిపించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే అల్లుడు శీను, స్పీడున్నోడు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్తో అలరించింది ఈ బ్యూటి. ఈ సారి మాస్ యాక్షన్ హీరో గోపిచంద్తో కలిసి స్పెషల్ సాంగ్లో స్టెప్పేసేందుకు రెడీ అవుతోంది.
గతంలో సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన రచ్చ, బెంగాళ్ టైగర్ సినిమాల్లో హీరోయిన్గా నటించిన తమన్నా, అదే దర్శకుడి కోసం ఐటమ్ సాంగ్కు ఒప్పుకుంది. సంపత్ నంది కూడా తమన్నా తనకు లక్కీ హీరోయిన్ అని భావించి ఆమెను సంప్రదించాడట. గోపిచంద్ ప్రస్తుతం ఆక్సిజన్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు ప్లాన్ చేసుకున్నాడు.