ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ పీవీపీ సినిమా అధినేత పొట్లూరి వరప్రసాద్ తెలుగులో భారీ ఎత్తున చిత్ర నిర్మాణాన్ని చేబడుతున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబుతో మూడు చిత్రాల డీల్ కుదుర్చుకున్నట్టు తాజా సమాచారం. ఈ ఒప్పందంలో భాగంగా, ముందుగా ఈ ఏడాది శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'బ్రహ్మోత్సవం' చిత్రాన్ని నిర్మిస్తారనీ, మిగతా రెండు చిత్రాలనూ వచ్చే ఏడాది నిర్మిస్తారనీ చెబుతున్నారు. ఇవి కాకుండా, ఇప్పటికే ఆయన మరో మూడు చిత్రాలను ప్లాన్ చేసుకున్నారు. వీటిలో నాగార్జున, కార్తీ కాంబినేషన్లో ఒకటి, 'బెంగళూర్ డేస్' రీమేక్ ఒకటి కాగా, అనుష్క ప్రధానపాత్రధారిగా ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో మరో సినిమా నిర్మిస్తున్నారు.
maheshbabu, pvp, srikanthaddala, newmovie,