దాదాపు సంవత్సరం పైగానే లాంగ్ గ్యాప్ తీసుకున్న మాస్ మహారాజ్ రవితేజ ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాల్ని సైన్ చేశాడు. వాటిలో ఒకటి టచ్ చేసి చూడు. టైటిల్ లోనే పూర్తి వెరైటీని నింపుకున్న ఈ చిత్రం కథలో, రవితేజ పాత్రలో కూడా చాలా కొత్తగా ఉండి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని మేకర్స్ చెబుతున్నారు. నూతన దర్శకుడు విక్రమ్ సిరి డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారట. అందులో ఒకరు రాశి ఖన్నా అని ఇదివరకే నిర్మాతలు తెలిపారు.
ఇక రెండవ హీరోయిన్ గతేడాది సోగ్గాడే చిన్ని నాయనా, శ్రీరస్తు శుభమస్తు చిత్రాలతో మంచి హిట్లందుకున్న లావణ్య త్రిపాఠి అని తెలుస్తోంది. కానీ లావణ్య నుండి గాని, నిర్మాణ సంస్థ లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ నుండి గాని ఇంకా ఎలాంటి పక్కా ఇన్ఫర్మేషన్ బయటకు రాలేదు. ఇకపోతే ఫిబ్రవరి నుండి మొదలుకానున్న ఈ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్రీతమ్ సంగీతం అందించనున్నారు.