Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Aug-2017 13:04:09
facebook Twitter Googleplus
Photo

సినిమాల విడుదలతో జనాలకు మంచి వినోదం అందనుంది. దసరాకు ఎలాగూ స్టార్ హీరోలు మహేశ్ బాబు - ఎన్టీఆర్ సినిమాలు వచ్చి సందడి చేయబోతున్నారు. అయితే ఇప్పుడు కొన్ని సినిమాలకు విడుదల తేది దొరక్కా తేగ ఇబ్బంది పడిపోతున్నాయిని ఇండస్ట్రి టాక్. అలా ఇబ్బంది పడకూడదనే అగ్ర హీరో బాలకృష్ణ దసరాకు రావాలిసింది సెప్టెంబర్ 1న వస్తున్నాడు. అయితే ఈ తేదీలో మరే సినిమా లేదు అనుకున్న టైమ్ లో మరో కామిడీ హీరో వచ్చి లైన్ లో నిలబడ్డాడు.

హీరో సునిల్ నటించిన సినిమా ఉంగరాల రాంబాబు షూటింగ్ పూర్తి చేసుకొని చాలా నెలలు అయినా విడుదల చేయడానికి మాత్రం ఇప్పటికి వీలుపడింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మూలంగా లేట్ అయ్యిందని ఉంగరాల రాంబాబు టీమ్ చెబుతోంది. ఏది ఏమైనా సునిల్ సినిమాకు ఎట్టకేలకు ఒక తేది దొరికింది. పూరీ జగన్నాధ్ డైరక్షన్లో బాలయ్య హీరోగా నటించిన పైసా వసూల్ సినిమా సెప్టెంబర్ 1న వాయు వేగంతో వస్తుంటే ఆ వెంటనే సెప్టెంబర్ 2 న సునిల్ నటించిన ఉంగరాల రాంబాబు కూడా విడుదల అవుతుంది. మాస్ ఎంటర్ టైనర్ పైసా వసూల్ చేయబోయే సంచలనం ముందు ఫ్యామిలి ఎంటర్ టైనర్ ఉంగరాల రాంబాబు సినిమా ఎలా నిలవబోతుందో చూడాలి. అయితే సాధారణంగా సినిమాలు శుక్రవారం విడుదల అవుతూ ఉంటాయి. కానీ పైసా వసూల్ లాంటి పెద్ద కమర్షియల్ సినిమా విడుదలకావడంతో సునిల్ నటించిన ఈ సినిమాను శనివారం విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేసిన ఉంగరాల రాంబాబు సినిమాలో సునిల్ కి జంటగా మియా జార్జ్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా పూర్తి ఫ్యామిలి ఎంటర్ టైనర్ గా ఉండబోతుందిని చెబుతున్నారు. మొత్తానికి ఇలాంటి కాంబినేషన్తో సినిమాలు విడుదలకావడం కొంచం అరుదనే చెప్పాలి.

,  ,  ,  ,  ,  ,