మెగా హీరో వరుణ్ తేజ్ లోఫర్ చిత్రం తరువాత కాస్త గ్యాప్ లోనే రెండు సినిమాలకి సైన్ చేసేశాడు. వాటిలో ఒకటి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ఫిదా కాగా మరొకటి శ్రీను వైట్ల దర్శకత్వంలో చేస్తున్న కమర్షియల్ ఎంటర్టైనర్ మిస్టర్. వరుస పరాజయాల తరువాత శ్రీను వైట్ల చేస్తున్న ఈ చిత్రం యొక్క రెండవ షెడ్యూల్ ను కూడా పూర్తికాగా సినిమాని మొదట డిసెంబర్ బరిలోకి దింపాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఆ తేదీ కాస్త మారినట్టు వార్తలు వస్తున్నాయి.
డిసెంబర్ లో చరణ్ ?ధృవ?, సూర్య ?సింగం?, వెంకటేష్ ?గురు? వంటి పెద్ద పెద్ద సినిమాలు రిలీజవుతుండటంతో రిస్క్ తీసుకోవడం ఎందుకని సినిమాని వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేయాలని నిర్మాతలు ఫిక్సయ్యారట. ఈ వార్తపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇకపోతే ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మందులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.