కొన్ని సంవత్సరాల క్రితం ఆనాటి రెబెల్ స్టార్ కృష్ణం రాజు ప్రధాన పాత్రగా వచ్చిన భక్త కన్నప్ప అప్పట్లో మంచి విజయాన్నే అందుకుంది. అలాంటి ఈ కథను మళ్లీ తెరకెక్కించనున్నట్టు మోహన్ బాబు నిర్మించి నటించిన 'పెదరాయుడు' చిత్రం 20 వసంతాలను పూర్తిచేసుకున్న సందర్భంలో మంచు విష్ణు ప్రకటించాడు. ఈ సినిమాలో విష్ణు కథానాయకుడిగా కనిపించనున్నట్టు, . 24 ఫ్రేమ్స్ బ్యానర్ పైన హాలీవుడ్ స్టూడియో భాగస్వామ్యంతో వివిధ భాషా ప్రేక్షకుల ముందుకు భక్త కన్నప్పను తీసుకువచ్చేలా మోహన్ బాబు ప్లాన్ చేసారనీ.,ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందనుందనీ, హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేయనున్నారని వార్తల మీద వార్తలు వచ్చాయి.