Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Jul-2017 14:07:03
facebook Twitter Googleplus
Photo

ప్రభావవంతమైన వ్యక్తుల పేర్లు తీస్తే.. అందులో తెలుగువారికి చోటు దక్కడం అరుదు. ఐతే తాజాగా ప్రకటించిన ఈ జాబితాలో నెంబర్ వన్ స్థానంతో పాటు ఆరో స్థానం కూడా తెలుగువారికే దక్కింది. గత ఏడాది రియో ఒలింపిక్స్ లో రజతం గెలిచి దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు.. తాజాగా ప్రకటించిన అత్యంత ప్రభావవంతమైన భారతీయులు జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ జాబితాలో సింధునే అత్యంత పిన్న వయస్కురాలు కావడం విశేషం. ఆమెకిప్పుడు 22 ఏళ్లే. ఇక బాహుబలి తో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించి.. యూత్ ఐకాన్ గా మారిపోయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఈ జాబితాలో ఆరో స్థానం సంపాదించాడు.

ఇక ఈ జాబితాలో మిగతా వ్యక్తుల సంగతి చూస్తే.. పంజాబ్ నటుడు.. గాయకుడు దిల్జీత్ దోసాంజ్ రెండో స్థానంలో నిలిచాడు. వివాదాస్పద చిత్రం లిప్ స్టిక్ అండర్ మై బురఖా తో సంచలనం రేపుతున్న రైటర్.. ఫిలిం మేకర్ అలంకృత శ్రీవాస్తవ మూడో స్థానం సాధించింది. కమెడియన్ కరణ్ గిల్ నాలుగో స్థానంలో.. చెఫ్-రెస్టారెంట్ యజమాని మను చోప్రా ఐదో స్థానంలో నిలిచారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ బాలీవుడ్ యాక్టర్ రాజ్ కుమార్ రావు.. ప్రభాస్ తర్వాత.. ఏడో స్థానంలో నిలిచాడు. మ్యుజీషియన్ బాద్షా.. డిజైనర్ సంజయ్ గార్గ్ తర్వాతి స్థానాలు సాధించారు. వివాదాస్పద బాలీవుడ్ నటి రాధికా ఆప్టే పదో స్థానంలో నిలిచింది.

,  ,  ,  ,  ,