స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ భోయపాటి శీనుల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ?సరైనోడు? సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఎన్నో ప్రత్యేకతలను నింపుకున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో హీరో ఆది పినిశెట్టి విలన్గా నటించడం కూడా ఓ విశేషంగా చెప్పుకోవచ్చు. తెలుగు, తమిళ భాషల్లో హీరోగా మెప్పిస్తోన్న ఆది, ఈ సినిమాలో విలన్గా చేయడం, విలన్గా ఆయన సినిమాలో ఏ రేంజ్లో అలరించనున్నారో ట్రైలర్తోనే చిన్న స్పష్టతనివ్వడం చూస్తూంటే ఆది పాత్రకు కూడా ముందునుంచే మంచి క్రేజ్ వస్తోంది.
ఇక సరైనోడులో విలన్గా నటించడం గురించి మాట్లాడుతూ.. ?అందరూ హీరోగా బాగానే మెప్పిస్తున్నావు కదా.. ఇప్పుడే విలన్గా ఎందుకు చేశావ్? అని అడుగుతున్నారు. దానికి సమాధానం ఏప్రిల్ 22న సరైనోడు సినిమాయే చెబుతుంది? అన్నారు. నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు భోయపాటి శీను, హీరో అల్లు అర్జున్ ఈ సినిమాకు మేజర్ పిల్లర్స్ అని, వాళ్ళ కష్టంపై నమ్మకం ఉందని, సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని ప్రమోషన్స్లో భాగంగా ఆది తెలియజేశారు.